కెప్టెన్లను ఎంపిక చేసినా శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: లిమిటెడ్ ఫార్మట్కు ఉపుల్ తరంగ, టెస్టులకు దినేష్ చండిమల్లను కెప్టెన్లుగా ఎంపికచేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. బలహీనమైన జింబాంబ్వేతో స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నవిషయం తెలిసిందే. దీంతో శ్రీలంక బోర్డు అత్యవసరంగా సమావేశమై బుధవారం నూతన కెప్టెన్లను ప్రకటించింది. జట్టులో సీనియర్ ప్లేయర్ దినేష్ చండీమల్ను టెస్టులకు , మరో ఆటగాడు ఉపుల్ తరంగను వన్డే, టీ20లకు కెప్టెన్లుగా నియమించింది.
ఉపుల్ తరంగ శ్రీలంక తరుపున 207 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో 6,212 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 27 మ్యాచ్ల్లో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1,568 పరుగులు చేశాడు. ఇక టెస్టు కెప్టెన్ దినేష్ చండీమల్ 36 టెస్టులు ఆడి 8 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలతో 2,540 పరుగులు చేశాడు. చండీమల్ కెప్టెన్గా జింబాంబ్వేతో జరిగే ఎకైక టెస్టు నుంచి బాధ్యతలు చెపట్టనున్నాడు. వీరి సారథ్యంలోనే శ్రీలంక స్వదేశంలో భారత్తో 3 టెస్టులు, 5 వన్డేలు, 1టీ20 ఆడనుంది.
జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను లంక క్లీన్స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్లో అతను గాయంతో కీలకమైన సిరీస్లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్గా మాథ్యూస్ ఘనతకెక్కాడు.
ఉపుల్ తరంగ శ్రీలంక తరుపున 207 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో 6,212 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 27 మ్యాచ్ల్లో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1,568 పరుగులు చేశాడు. ఇక టెస్టు కెప్టెన్ దినేష్ చండీమల్ 36 టెస్టులు ఆడి 8 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలతో 2,540 పరుగులు చేశాడు. చండీమల్ కెప్టెన్గా జింబాంబ్వేతో జరిగే ఎకైక టెస్టు నుంచి బాధ్యతలు చెపట్టనున్నాడు. వీరి సారథ్యంలోనే శ్రీలంక స్వదేశంలో భారత్తో 3 టెస్టులు, 5 వన్డేలు, 1టీ20 ఆడనుంది.
జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను లంక క్లీన్స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్లో అతను గాయంతో కీలకమైన సిరీస్లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్గా మాథ్యూస్ ఘనతకెక్కాడు.

Comments
Post a Comment