డ్ర‌గ్స్ కేసు సాయంత్రం 5 గంట‌ల‌కు మీడియాకు వెల్ల‌డి :ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్

 

హైద‌రాబాద్: డ్ర‌గ్స్ కేసులో ఐదో రోజు విచార‌ణ ఇవాళ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. హీరో న‌వ‌దీప్ ఇవాళ సిట్ ముందు హాజ‌ర‌య్యాడు. అయితే.. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ కు సంబంధించిన వివ‌రాల‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు మీడియాకు వెల్ల‌డిస్తామ‌ని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. ఇవాళ అకున్ స‌బ‌ర్వాల్, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ చంద్ర‌వ‌ద‌న్ అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. గుడంబా నిర్మూల‌న‌, పున‌రావాస చ‌ర్య‌లు, హ‌రిత‌హారంపై ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్ అధికారుల‌తో స‌మీక్షించామ‌ని అకున్ తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు