తదుపరి ప్రాజెక్టులను ప్రకటించి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసిన నేచురల్ స్టార్ నాని

 నా తదుపరి ప్రాజెక్టులను ప్రకటిస్తానంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసిన నేచురల్ స్టార్ నాని… ఈ రోజు తన 20, 21వ మూవీలపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ సినిమాలో నటిస్తున్న నేచురల్ స్టార్… ఆ సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారని ప్రకటించాడు.
ఎంసీఏ తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీతో సినిమా చేయబోతున్నానని తెలిపాడు నాని… నాని డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి హిప్ హాప్ తమీజా మ్యూజిక్ అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. వరుస విజయాలతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్… వైవిధ్యమైన కథలతో వెరైటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తాజాగా రిలీజైన నిన్నుకోరి సినిమాతో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఏడు హిట్లు కొట్టాడు. ఈ త‌రం హీరోల‌లో స‌క్సెస్ రేటు ఉన్న హీరోల్లో అగ్రస్థానంలో ఉన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు