త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ: మంత్రి లోకేష్
గుంటూరు: మంగళగిరి పట్టణం మినీ అమీర్పేటగా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంగళగిరి కేంద్రంగా పలు ఐటీ శిక్షణా కేంద్రాలు రాబోతున్నాయని మంత్రి అన్నారు. అలాగే ప్రపంచస్థాయి ప్రమాణాలతో అవరావతికి డేటా సెంటర్ రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందని, త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ తీసుకురాబోతున్నామని ఆయన తెలిపారు. అంతేగాక రెండేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎలక్ట్రానిక్స్లో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు.

Comments
Post a Comment