జీఎస్టీ అధ్యయనానికి జిల్లాలవారీగా ఐఏఎస్లు
జీఎస్టీ అధ్యయనానికి జిల్లాలవారీగా ఐఏఎస్లు
-10 మంది అధికారులకు బాధ్యతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకోవడానికి కేంద్రప్రభుత్వం పది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని 27 జిల్లాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఎంపికచేసిన ప్రాంతాలలో పర్యటించి ఏకీకృత పన్ను విధానంలో వ్యాపార, వాణిజ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు, ఒనగూరుతున్న ప్రయోజనాలను తెలుసుకుంటారు. ఈ అధికారులు రాష్ట్రంలో పది రోజులు పర్యటించే అవకాశం ఉన్నదని సమాచారం. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని వస్త్ర పరిశ్రమ విభాగం సీనియర్ ఐఏఎస్ అధికారి పుష్పా సుబ్రమణియన్ రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరుపై ఇప్పటికే ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలు, ప్రాంతాలవారీగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షకులుగా నియమించిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
-10 మంది అధికారులకు బాధ్యతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకోవడానికి కేంద్రప్రభుత్వం పది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని 27 జిల్లాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఎంపికచేసిన ప్రాంతాలలో పర్యటించి ఏకీకృత పన్ను విధానంలో వ్యాపార, వాణిజ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు, ఒనగూరుతున్న ప్రయోజనాలను తెలుసుకుంటారు. ఈ అధికారులు రాష్ట్రంలో పది రోజులు పర్యటించే అవకాశం ఉన్నదని సమాచారం. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని వస్త్ర పరిశ్రమ విభాగం సీనియర్ ఐఏఎస్ అధికారి పుష్పా సుబ్రమణియన్ రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరుపై ఇప్పటికే ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలు, ప్రాంతాలవారీగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షకులుగా నియమించిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

Comments
Post a Comment