మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదు…పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి
మంత్రి పదవి కోసం కోయదొరలతో పూజలు చేయించారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి… మంత్రి పదవికోసం నా కూతురితో పూజలు చేయించలేదన్న ఎమ్మెల్యే… తన ఆరోగ్యం కోసమే కోయదొరలతో నా కూతురు పూజలు చేయించుకుందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కూతురితో కేసు పెట్టించానన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కోయదొరలతో పూజలు చేయించారన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి… ఈ విషయాన్ని కోయదొరలు పోలీసుల దగ్గర ఒప్పుకున్నారని తెలిపారు. వారి దగ్గర వీఐపీలతో దిగిన ఫొటోలున్నాయన్నారాయన. కాగా, పూజలు చేస్తే మంత్రి పదవి వస్తున్న ఆశతో కోయదొరలతో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి పూజలు చేయించారంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే… పూజలు పేరుతో ఆయన నుంచి రూ.57 లక్షలు దండుకున్నారు పూజారులు… తదనంతరం ఆయన తన కూతురితో కేసు పెట్టించారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.

Comments
Post a Comment