తెలంగాణలో ముగిసిన పోలింగ్‌- ఓటింగ్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం

తెలంగాణలో ముగిసిన పోలింగ్‌


- ఓటింగ్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం
హైదారబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 117 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోని వారిలో మజ్లిస్‌కు చెందిన అక్బరుద్దీన్‌ ఒవైసీ, తెరాసకు చెందిన మనోహర్‌రెడ్డి ఉన్నారు. వీరిలో మనోహర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా అపోలో చికిత్స పొందుతుండగా.. ఒవైసీ లండన్‌ వెళ్లారు.
ఈ ఉదయం పది గంటలకు ఓటింగ్‌ ప్రారంభమవ్వగా.. సీఎం కేసీఆర్‌ తొలి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చివరగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు ఉదయం బ్యాలెట్‌ బాక్సులను దిల్లీకి తరలించనున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు