తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో నేడు గ్రీన్‌డే

విద్యాసంస్థల్లో నేడు గ్రీన్‌డే

మూడోవిడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యా రు. శనివారం గ్రీన్‌డేగా పాటిస్తూ తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో ఒకేరోజు 28లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొత్తం 40లక్షల మొక్క లు నాటేందుకు విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఉదయం 8:30గంటల నుంచి 9:30గంటల వర కు 'హరిత పాఠశాల-హరిత తెలంగాణ' పేరుతో మొక్కల ఆవశ్యకతను గ్రామం, పట్టణంలోని ప్రజ లకు తెలియజేసేందుకు విద్యార్థులు ర్యాలీలు నిర్వ హించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మొక్కలు పాఠశాలల ఆవరణలో నాటనున్నారు.

ఉదయం 10:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు హరితహారం కార్యక్రమం పై పాఠశాల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, డ్రా యింగ్‌, నాటికలు, క్విజ్‌ మొదలైన పోటీలు ఉపా ధ్యాయులు విద్యార్థులకు నిర్వహించనున్నా రు. పాఠశాలల్లో మొక్కలను సంరక్షించేందుకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులతో గ్రీన్‌ బ్రిగేడ్‌లను ఏర్పా టు చేయనున్నారు. ప్రహరిగోడలు లేని పాఠ శాలల్లో మొక్కలకు కచ్చితంగా ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే హెచ్‌ఎంలకు అధికారులు సూచించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు