ఆలస్యంగా వచ్చా, క్షమించు- సమంత
కరీంనగర్: హీరోయిన్ సమంత, అక్కినేని అఖిల్ కలిసి బుధవారం కరీంగనర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను అఖిల్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కరీంనగర్లో తనకు కాబోయే వదిన సమంతతో కలిసి షాపింగ్ మాల్ను ప్రారంభించడం గౌరవంగా ఉందని ట్వీట్ చేశాడు. దీనికి సమంత రీట్వీట్ చేస్తూ.. ‘అఖిల్ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చా, క్షమించు. అప్పటికే నిన్ను చూసి అభిమానులు తెగ కేకలు పెడుతున్నారు’ అని ట్వీట్ చేసింది. దీనికి అఖిల్ … ‘సామ్!!! ధన్యవాదాలు వదిన గారు’ అని రీట్వీట్ చేశాడు.

Comments
Post a Comment