కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది: కవిత
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సురభి ఎడ్యూకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్, ఎపి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని కవిత తెలిపారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె చెప్పారు.

Comments
Post a Comment