పాక్ అభిమానుల అత్యుత్సాహం....
పాక్ ఫైనల్లో ప్రవేశించిన అత్యుత్సాహంలో భారత్ మాజీ కెప్టెన్, సౌరవ్గంగూలీపై దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన తరువాత ఈ దాడులకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సౌరవ్ గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా అడ్డుపడిన పాక్ అభిమానులు, కారుపై ఎక్కడంతోపాటు దాడి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాక్ జెండా పట్టుకుని కారు దాదా కారు కదలకుండా నలువైపులా నిర్భందించారు. అయితే కారు లోపలి నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయారు.
Comments
Post a Comment