Posts

Showing posts from June, 2017

జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ డెస్క్‌

Image
జీఎస్టీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ డెస్క్‌ : Email: cbecmitra.helpdesk@icegate.gov.in Telephone: 1800 1200 232 జీఎస్టీఎన్‌ హెల్ప్‌ డెస్క్‌ : Email: helpdesk@gst.gov.in Telephone: 0120 4888999 Twitter handles: @askGST_GOI, @askGSTech టెక్‌ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రాలతో కలిసి జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌ రెండు కాల్‌ సెంటర్లను కూడా పన్ను చెల్లింపుదారులకు, పన్ను అధికారుల కోసం ఏర్పాటుచేసింది. పన్ను చెల్లింపుదారులకు హెల్ప్‌లైన్‌ నెంబర్‌: 0120-4888999 కాగ, పన్ను అధికారులకు 0124-4479900 నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.

18వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. రైతుకు ఊరట

Image
18వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. రైతుకు ఊరట న్యూఢిల్లీ: జీఎస్టీ 18వ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎరువులపై ప్రతిపాదించిన 12 శాతం వస్తు సేవల పన్నును 5 శాతానికి తగ్గించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో చివరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీ అమలుపై సభ్యులు తుది కసరత్తు చేశారు. రైతులపై భారం పడుతుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఎరువులపై ప్రతిపాదించిన పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించినట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అలాగే ట్రాక్టర్ల విడి విభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ఆయన వివరించారు. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనున్న ప్రత్యేక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో జులై 1 నుంచి జీఎస్టీ దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తుంది.

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం

Image
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నియామకం ఢిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్(86) నూతన అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. వేణుగోపాల్ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతిత్వరలోనే విడుదల కానున్నాయి. మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేణుగోపాల్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో అమికస్ క్యూరీగా వాదనలు వినిపించారు. మండల్ కేసు, అయోధ్య వివాదం, న్యాయవ్యవస్థలో నియామకాలపై సమర్థవంతంగా ఆయన తన వాదనలు వినిపించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ అయోధ్య కేసు, మాయవతి అవినీతి కేసులను వేణుగోపాల్ వాదించారు. 50 ఏళ్ల తన సుదీర్ఘ కేరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. 2015లో పద్మ విభూషణ్, 2002లో పద్మ భూషణ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వేణుగోపాల్‌ను వరించాయి.

'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు'

Image
'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు' హైదరాబాద్: జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'జాతీయ స్థాయి ప్లీనరీకి 30 వేల మంది దాకా ప్రతినిథులు వస్తారు. మూడు అంచెల్లో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలు జరపాలని నిర్ణయించాం. భారీ ప్లీనరీ నిర్వహణకు 18 కమిటీలు ఏర్పాటు చేశాం. ప్లీనరీ తొలిరోజు 8న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజైన 9వ తేదీన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, సభ నిర్వాహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, మీడియా, కల్చరల్, రవాణా, పార్కింగ్ వంటివాటి నిర్వహణకు ఈ 18 కమిటీలు పనిచేస్తాయి. ప్లీనరీ తొలిరోజు(జులై 8)న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజు(జూలై 9)న పార్టీ అధ్యక్షు...

గరగపర్రు వివాద పరిష్కారానికి కమిటీ .. ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ వేసిన వైఎస్‌ జగన్‌

Image
గరగపర్రు వివాద పరిష్కారానికి కమిటీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ వేసిన వైఎస్‌ జగన్‌ ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో తలెత్తెతిన వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చొరవ చూపారు. వివాద పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ నియమించారు. ఇందులో మేరుగ నాగార్జున, కొయ్యే మోషెన్‌రాజు, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు సభ్యులుగా ఉంటారు. వైఎస్‌ జగన్‌ ఈరోజు గరగపర్రులో పర్యటించారు. వివాదం పూర్వాపరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని ఆయన హామీయిచ్చారు. ఇందులో భాగంగా తమ పార్టీ తరపున కమిటీ ఏర్పాటు చేసి మాట నిలుపుకున్నారు.

ఆన్‌లైన్లో ఔషధాల అనుమతులు : మంత్రి లక్ష్మారెడ్డి

Image
ఆన్‌లైన్లో ఔషధాల అనుమతులు : మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్ : ఆన్‌లైన్లో ఔషధాల అనుమతుల విధానం కోసం మెరిట్ వెబ్‌సైట్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వెబ్‌సైట్ ప్రారంభంతో ఇకపై ఔషధాల అనుమతుల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది. వైద్యవిద్య, పరిశోధనల ప్రోత్సాహానికి మెరిట్ అప్లికేషన్ ఉపయోగపడనుంది. విద్యార్థులు, అధ్యాపకులకు సౌకర్యంగా ఉండేలా మెరిట్ అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా ఆన్‌లైన్లో ఔషధ అనుమతులు ఇస్తామన్నారు. ఈ విధానం రేపట్నుంచి అమల్లోకి వస్తుందన్నారు. గతంలో ఔషధ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఇకపై ఔషధ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ఇబ్బందులు పడక్కర్లేదని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక లేబొరేటరి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ కిట్ల కోసం ఇప్పటి వరకు 3.65 లక్షల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వేరికోజ్ వీన్స్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. ఇకపై వేరికోజ్ వీన్స్ వ్యాధ...

టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్

Image
ఫైబర్ టు ఫ్యాషన్! ఇదే మా లక్ష్యం- టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్ వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్. అత్యంత్య ప్రాధాన్యత రంగంగా వస్త్ర రంగాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ను నిర్మిస్తుందన్నారు. గుజరాత్ గాంధీనగర్, మహాత్మానగర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన టెక్స్ టైల్ ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీతో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్న కేటీఆర్, త్వరలోనే టెక్స్ టైల్ పాలసీని కూడా తెస్తామన్నారు. పారిశ్రామిక విధానంలానే ఈ పాలసీ కూడా విప్లవాత్మకంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కును...

భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది.

Image
భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మరో చారిత్రక ఘటనకు వేదిక కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీని జులై 1 నుంచి అమలు చేస్తోంది. దీని కోసం శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఆర్థిక సంస్కరణల ఆరంభం కోసం పార్లమెంట్‌ను అందంగా ముస్తాబు చేశారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణం విద్యుత్ ధగధగలతో మెరిసిపోతోంది. భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే అర్థరాత్రి వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. 1947 ఆగస్ట్ 15న భారత్‌కు స్వాత్రంత్యం వచ్చిన సందర్భంగా తొలిసారి, 1972 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 25 ఏళ్ళైన సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలప్పుడు రెండోసారి నిర్వహించారు. అలాగే స్వాత్రంత్యం వచ్చి 50 ఏళ్ళైన సందర్భంగా 1997 ఆగస్ట్ 15న గోల్డెన్ జుబ్లీ వేడుకల కోసం మూడోసారి అర్థరాత్రి వేళ...

కోచ్‌గా ద్రవిడ్‌కు మరో రెండేళ్లు పొడిగింపు: బీసీసీఐ ట్వీట్

Image
కోచ్‌గా ద్రవిడ్‌కు మరో రెండేళ్లు పొడిగింపు: బీసీసీఐ ట్వీట్ ఇండియా  ఏ, అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బీసీసీఐ జూన్ 30 (శుక్రవారం) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. 2015లో పది నెలల పాటు ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ద్రవిడ్ నేతృత్వంలోని ఇండియా ఏ, అండర్-19 జట్లు మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ ఒప్పందాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ముక్కోణపు సిరిస్‌లో ఇండియా ఏ జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో అండర్-19 జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. 2015లో తొలుత చేసుకున్న 10 నెలల కోచ్‌ పదవికి గాను బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కి సుమారు రూ.4 కోట్లను వేతనంగా ఇచ్చింది. తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి ఇంకా పెద్ద మొత్తంలో అందుతుంది. ద్రవిడ్ పదవీ కాలం...

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16 సర్పంచ్‌లు, 4 ఎంపీటీసీ, 133 వార్డుమెంబర్ల స్థానాలకు ఈసీ ఎన్నికల ప్రకటనను విడుదల చేసింది. ఆయా స్థానాలకు వచ్చే నెల 13న ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు పేర్కొంది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల వివరాలిలా ఉన్నాయి. సర్పంచ్ స్థానాలు.. - ఆదిలాబాద్ జిల్లా అంతర్గామ్ - కరీంనగర్ జిల్లా ముంజంపల్లి, రామచంద్రపూర్ - ఆసిఫాబాద్ జిల్లా మంగి - మహబూబ్‌నగర్ జిల్లా బుద్దారం, కోటకదిర - మెదక్ జిల్లా వెంకటాపూర్ - సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్, సత్యగామ - నల్లగొండ జిల్లా మైనంపల్లి, రాజుపేట - నిజామాబాద్ జిల్లా బెజ్జోర - రాజన్న సిరిసిల్ల జిల్లా నరసింగాపూర్ - సిద్దిపేట జిల్లా సముద్రాల, తిమ్మారెడ్డిపల్లి - సూర్యాపేట జిల్లా గోల్తండా సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. - రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం పహాడీషరీఫ్ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎంపీటీసీ స్థానాలు.. - జిగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం-2 - జోగులాంబ జిల్లా కాలూర్ తిమ్మాన్‌దొడ్డి - మహబ...

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని మీరాకుమార్‌ శుక్రవారం సబర్మతి ఆశ్రమం నుంచే ప్రారంభించారు

Image
అహ్మదాబాద్‌: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో కొద్ది సేపు ఛరఖా తిప్పి నూలు వడికారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని మీరాకుమార్‌ శుక్రవారం సబర్మతి ఆశ్రమం నుంచే ప్రారంభించారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలతో కలిసి వెళ్లిన ఆమె ఆశ్రమంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నారు. ‘ప్రస్తుతం నా పోరాటం గాంధీజీ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే’ అని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం పార్లమెంటు హౌస్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. పాలక ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఆమె బరిలోకి దిగారు. ఇప్పటికే కోవింద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. మీరాకుమార్‌ శుక్రవారం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. 20న ఫలితాలు వెలువడనున్నాయి.

జులై 1 నుంచి జీఎస్టీ కాకుండా ఇంకా జ‌ర‌గ‌బోయే కొన్ని ప్ర‌ధాన మార్పులు..

Image
జులై 1 త‌ర్వాత దేశంలో రాబోయే మార్పులివే జులై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ అమ‌లు అవ‌నుండ‌టంతో ప‌రోక్ష ప‌న్నుల విధానంలో చాలా మార్పులు జ‌రుగుతాయి. నేరుగా కాక‌పోయినా ప‌రోక్షంగా అయినా ప్ర‌జ‌ల‌పై వివిధ రూపాల్లో ధ‌ర‌ల ప్ర‌భావం పడుతుంది. అయితే కేవ‌లం జీఎస్టీనే కాదు జులై 1 నుంచి ఇంకా కొన్ని మార్పులు ప్ర‌జ‌ల జీవితాల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి. జులై 1 నుంచి జీఎస్టీ కాకుండా ఇంకా జ‌ర‌గ‌బోయే కొన్ని ప్ర‌ధాన మార్పుల గురించి తెలుసుకుందాం. రైల్వే ఈ-టిక్కెట్లు జులై 1 నుంచి రాజ‌ధాని, శ‌తాబ్ది ట్రైన్ టిక్కెట్లు కాగిత ర‌హితంగా మార‌నున్నాయి. న‌గ‌దు ర‌హిత‌, కాగిత ర‌హిత వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేందుకు రైల్వే కంక‌ణం క‌ట్టుకుని ఉంది. మొట్ట‌మొద‌ట రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌, శ‌తాబ్ది రైళ్ల‌తో మొద‌లుకొని అన్ని రైళ్ల‌కు పేప‌ర్ లెస్ టిక్కెటింగ్ వ్య‌వస్థ‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ప్రీమియం రైళ్ల‌లో ప్ర‌యాణించే వారు త‌నిఖీల స‌మ‌యంలో ఈ-టిక్కెట్ల‌ను చూపిస్తే స‌రిపోతుంది. ఐటీ రిట‌ర్నులు జులై 1 నుంచి ఐటీ రిట‌ర్నుల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి. ఆదాయ‌పు ప‌న్ను వెబ్‌సైట్లో ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్నులు చేసేందుకు ఇంత‌కుముం...
Image
'జయ జానకి నాయక' ఫస్టులుక్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ .. కేథరిన్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరైన బోయపాటి ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఫస్టు లుక్ పోస్టర్ గా లవ్ ఫీల్ కలిగిన దృశ్యాన్ని వదలడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చేనెల 7వ తేదీన విడుదల.

వాట్సాప్‌ తాజాగా సరికొత్త రెండు ఫీచర్స్ ను తీసుకరాబోతుంది.

Image
వాట్సాప్‌ లో ఇమేజ్ పంపడం ఇంకా ఈజీ.. ఎప్పుడు ఎక్కడ చూసిన వాట్సాప్‌ తో కాలం గడుపుతున్నారు. అందుకే వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే చాల ఫీచర్స్ అందించిన వాట్సాప్‌ తాజాగా సరికొత్త రెండు ఫీచర్స్ ను తీసుకరాబోతుంది. ‘ఇమోజీ సెర్చ్‌’, ‘వీడియో స్ట్రీమింగ్‌’ వంటి వాటిని పరిచయం చేయబోతుంది. చాలా మంది టెక్ట్స్‌ మెసేజ్‌ల కన్నా ఇమోజీల ద్వారానే తమ భావాలను ఇతరులకు పంపడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ఇమోజీలను పంపడం మరింత సులభతరం చేసింది వాట్సాప్‌. ఇందుకోసం ‘ఇమోజీ సెర్చ్‌’ను తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్‌ జీబోర్డ్‌లాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఇమోజీ సెర్చ్‌ అందుబాటులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగావున్న GST రేట్స్‌..

Image
ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ.. జులై ఒకటి నుంచి వస్తు సేవల పన్ను- జీఎస్టీ అమల్లోకి రానుండడంతో దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగు తోంది. దీనివల్ల సామాన్యుడి మేలు జరుగుతుందని పదేపదే చెబుతూ వస్తున్నారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. రకరకాల పన్నుల బాధ తప్పించుకోవడానికి జీఎస్టీ వల్ల ఉపశమనం కలుగుతుందని, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ బాటలోనే నడుస్తున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగావున్న GST రేట్స్‌.. అమెరికా- 7.5 % చైనా – 17 % జపాన్ – 8 % రష్యా- 18% ఆస్ర్టేలియా – 10% బహ్రెన్ -5% కెనడా-15% కొరియా-10% కువైట్ -5% మలేషియా-6% మారిషస్-15% మెక్సికో-16% మయిన్మార్ -3% న్యూజిలాండ్ -15% పిలిప్పీన్స్ -12% సింగపూర్ —7% సౌతాఫ్రికా-14% థాయిలాండ్ -7% యుఏఈ -5% వియత్నాం-10% జింబాబ్వే -15% ఇండియా – 28%

GST ఒకే దేశం.. ఒకే పన్ను...మరికొన్ని గంటలలో

Image
జీఎస్టీ ఒకే దేశం.. ఒకే పన్ను...మరికొన్ని గంటలలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత అత్యధిక స్థాయిలో ఉత్పత్తుల ధరలు యథావిధిగా ఉండనున్నప్పటికీ, తగ్గే అవకాశాలు మాత్రం లేవు. కానీ కొన్ని ఉత్పత్తులు ప్రియంకానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సేవలపై విధించే పన్ను పెరుగుతుండటంతో వినియోగదారులపై మరింత భారం పడనున్నది. ఆర్థిక సేవల్లో భాగంగా ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, బీమా ప్రీమియం, నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. జీఎస్టీతో ఆర్థిక సేవలు 18 శాతం స్లాబ్‌లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ సేవలపై 15 శాతం పన్ను విధిస్తున్నారు. దీంతో బిల్లులు మూడు శాతం వరకు పెరుగనున్నదన్నమాట. ఉదాహరణకు వార్షిక బీమా ప్రీమియం కోటి రూపాయల టర్మ్ ప్లాన్‌పై విధించే పన్ను రూ.3,750 నుంచి రూ.4,500కి పెరుగనున్నది. అలాగే నాలుగు ఏటీఎం లావాదేవీలు పూర్తైన తర్వాత జరిగే ప్రతిలావాదేవీపై ఎస్‌బీఐ రూ.50తోపాటు సేవాపన్ను(15 శాతం) విధిస్తుండగా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను 18 శాతం విధించనున్నది. ప్రస్తుతం రూ.10 వేల విత్‌డ్రాపై రూ.1,550 చెల్లించాల్సి ఉండగా, జీఎస్టీతో సేవా పన్ను రూ.1,850కి చేరుకోనున్నది. చార్జీల విధ...

రోడ్ ప్రమాదం లో నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.

Image
రోడ్ ప్రమాదం లో నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన రోడ్డుప్రమాదంలో సినీనటుడు రవితేజ సోదరుడు భరత్‌ మృతిచెందారు. రహదారిపై ఆగి వున్న లారీని భరత్‌ ప్రయాణిస్తున్న స్కోడా కారు (టీఎస్‌09 ఈసీ 0799) వేగంగా ఢీకొంది. కారు సగ భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ఘటనను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్‌జీఐఏ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణం గా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భర...
Image
ఆకాశంలో నెలవంక..  రంజాన్ శోభ పవిత్ర రంజాన్‌ సోమవారం జరుపుకోనున్నారు ముస్లింలు. ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా పాటిస్తున్న ఉపవాస దీక్షలకు ముగింపు పలకనున్నారు ముస్లింలు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్‌ సంస్కృతి ప్రతిబింబించేలా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత శ్రీకాంత్

Image
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత శ్రీకాంత్ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ను భారత్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ దక్కించుకున్నాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారుడు చెన్‌లాంగ్‌పై శ్రీకాంత్ వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్ ఛాంపియన్ చెన్‌లాంగ్‌పై 22-20, 21-16 తేడాతో శ్రీకాంత్ గెలిచాడు. దీంతో శ్రీకాంత్ వరుసగా ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలు సొంతం చేసుకున్నట్లైంది.

చిట్టితల్లికి ఎంత కష్టమో! రెస్క్యూ టీం ఆన్ని విధాలుగా ప్రయత్నం..

Image
 పాపను బయటకు తీయడానికి అన్ని విధాల ప్రయత్నాలు సాగుతున్నాయి. కాని పాప బయటకు రాలేదు. చూస్తుండగానే మూడు రోజులు గడిచిపోయాయి. బోరుబావిలో చిమ్మచీకట్లో.. గంటల కొద్దీ పాప ఎలా ఉందో అన్న టెన్షన్ పెరుగుతుంది. ఏడాది పాప.. తల్లిపాలు కూడా మరవలేదు. ఆ చిట్టి తల్లి కడుపు ఎంత పీక్కుపోతుందో.. ఏడ్చి సొమ్మసిల్లిందా.. నేను కళ్లు తెరిచి తెరవకుండానే పాతాళంలో పడిపోయానా అని రోదిస్తుంటుంది. తాను ఎక్కడ ఎన్నానో కూడా తెలియదు. చిమ్మ చీకటి.. నిన్న మొన్నటి వరకు తాను చూసిన ప్రపంచం వేరు.. 40 గంటలుగా చూస్తున్న నరకం వేరు.. చిట్టితల్లికి ఎంత కష్టమో! అన్ని ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. రెస్క్యూ టీం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా..ఫలించడం లేదు. పాపను ఎలాగైనా బతికించాలని రెస్క్యూ టీం చేస్తున్న  ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ పెరుగుతుంది.     

'చంపేశావు పో! వెల్‌డన్‌' : సానియా మీర్జా

Image
హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే పోయే సమాధానం చెప్పిన భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిథాలీ సరైన సమాధానం చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మహిళల వన్డే వరల్డ్ కప్ - 2017 జూన్‌ 24 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ ఒకరు భారత్‌, పాకిస్థాన్‌ జట్టులో మీ అభిమాన క్రికెట్‌ ఎవరు? అని మిథాలీని అడిగాడు. ఇదే ప్రశ్న పురుష క్రికెటర్‌ని అడుగుతారా? అంటూ తీవ్రంగా స్పందించింది. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు? అని పురుష క్రికెటర్లని అడగనప్పుడు.. పురుష క్రికెట్ జట్టులో ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నించింది. మిథాలీ నోటి వెంట వచ్చిన ఊహించని సమాధానంతో ఆ జర్నలిస్ట్ ఒక్కస...

పాక్ అభిమానుల అత్యుత్సాహం....

పాక్‌ ఫైనల్లో ప్రవేశించిన అత్యుత్సాహంలో భారత్‌ మాజీ కెప్టెన్‌, సౌరవ్‌గంగూలీపై దాడులకు పాల్పడ్డారు.  పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన తరువాత ఈ దాడులకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరవ్ గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా అడ్డుపడిన పాక్‌ అభిమానులు,  కారుపై ఎక్కడంతోపాటు దాడి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్‌ జిందాబాద్‌ ఇండియా ముర్దాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. పాక్‌ జెండా పట్టుకుని కారు దాదా కారు కదలకుండా నలువైపులా నిర్భందించారు. అయితే కారు లోపలి నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయారు.