వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
కడప: దివంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, జిల్లా వైసీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనతో పాటు వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, అనిల్, వైఎస్ భారతి, ఎంపీ అవినాష్రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు చేరుకున్నారు.


Comments
Post a Comment