తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తాజ్డెక్కన్లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంపై విస్తృతంగా చర్చ జరిగింది, తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అపోహలు సృష్టించరని, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కిరణ్కుమార్రెడ్డి బయపెట్టరని, రియల్ఎస్టేట్ పడిపోతదని అప్పటి నేతలు అన్నరని తెలిపారు. ఆదాయం వృద్ధి రేటు సహా 12 రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్లో క్రైంరేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.


Comments
Post a Comment